‘దళితబంధు’లో బైండ్ల కులస్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి‘
ABN , First Publish Date - 2021-09-18T07:50:41+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’లో బైండ్ల కులస్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని బైండ్ల (భవనీయ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుళ్ల గౌరిశంకర్ అన్నారు.
భువనగిరిటౌన్, సెప్టెంబరు 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’లో బైండ్ల కులస్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని బైండ్ల (భవనీయ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుళ్ల గౌరిశంకర్ అన్నారు. భువనగిరిలో శుక్రవారం నిర్వహించిన జరిగిన సంఘం జిల్లా సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో అన్యాయానికి గురైన బైండ్ల కులస్థులు తెలంగాణాలోనూ అదే దుస్థితి ఎదుర్కొంటున్నారన్నారు. బైండ్ల కులస్థుల సంక్షేమానికి ప్రభుత్వం ‘దళిత బంధు’లో ప్రధాన్యం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
బెండ్ల సంఘంఫజిల్లా అధ్యక్షుడిగా దేశపాక గణేష్
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శు లుగా దేశపాక గణేష్, చిన్నపాక రమేష్, ఉపాధ్యక్షుడిగా వగ్గు శ్రీకాంత్, కోశాఽధికారిగా ఇంద్రపల్లి కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు భాస్కర్, గాలయ్య, యాదగిరి, అశోక్, వెంకటరవీందర్ పాల్గొన్నారు.