7 నెలల గర్భవతి అయిన కోడలిని బైక్పై ఎక్కించుకుని డాక్టర్కు చూపించుకుని వస్తున్న మామ.. క్షణాల్లోనే ఊహించని ఘోరం..!
ABN , First Publish Date - 2022-06-16T22:08:48+05:30 IST
ఆమె ఏడు నెలల గర్భవతి.. ఆమెకు మెడికల్ చెకప్ చేయించడానికి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు..
ఆమె ఏడు నెలల గర్భవతి.. ఆమెకు మెడికల్ చెకప్ చేయించడానికి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది.. వారి బైక్ను క్రేన్ ఢీకొట్టింది.. దీంతో ఆ గర్భవతి బైక్ పై నుంచి 10 అడుగుల దూరంలో పడింది.. హాస్పిటల్కు తీసుకెళ్లే సమయానికే మరణించింది.. ఆమె మామ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.. రాజస్థాన్లోని టోంక్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
పెళ్లయి ఏడేళ్లు అయినా ఈ 23 ఏళ్ల మహిళకు కలగని సంతానం.. భర్త తీరుతో భరించలేక ఆమె చేసిన పనితో చివరకు ఇలా ఆస్పత్రిలో..
లంబారిసింగ్లో నివాసముంటున్న రామ్జీ లాల్ భార్య బాదం దేవి అనే మహిళ 7 నెలల గర్భవతి. ఆమెను రామ్జీ తండ్రి గజానంద్ చెకప్ కోసం బైక్పై మల్పురా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెనుక నుంచి వస్తున్న భారీ క్రేన్ వారి బైక్ను ఢీకొట్టింది. దీంతో బాదం దేవి 12 అడుగుల దూరంలో రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోయింది. గజనంద్ కూడా కింద పడిపోయాడు. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే బాదం దేవి మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గాయాలపాలైన గజానంద్కు చికిత్స కొనసాగుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పరారీలో ఉన్న క్రేన్ డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.