సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి

ABN , First Publish Date - 2020-07-14T17:12:09+05:30 IST

పశ్చిమ గోదావరి: ఆకివీడు మండలం అయిభీమవరంలో వైద్యం అందక అనారోగ్యంతో ఏడు నెలల గర్భిణి మృతి చెందింది.

సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి

పశ్చిమ గోదావరి: ఆకివీడు మండలం అయిభీమవరంలో వైద్యం అందక అనారోగ్యంతో ఏడు నెలల గర్భిణి మృతి చెందింది. కరోనా పరీక్ష చేయించుకుని వచ్చి రిపోర్ట్ చూపిస్తేనే వైద్యం చేస్తామని వైద్యులు తేల్చి చెప్పారు. గతంలో పరీక్ష చేయించుకున్న నెగిటివ్ రిపోర్టును చూపించినప్పటికీ వైద్యులు నిరాకరించారు. దీంతో వెంటనే ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ అప్పటికే నక్కా నిర్మల మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వలనే తల్లీ బిడ్డ ప్రాణాలు పోయాయని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-14T17:12:09+05:30 IST