AP News: రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-08-21T21:41:08+05:30 IST

విజయవాడ: బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్‌ను గద్దె దింపే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. జగన్‌ (CM Jagan) ప్రభుత్వానికి

AP News: రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం:  సోము వీర్రాజు

విజయవాడ: బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్‌ను గద్దె దింపే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. జగన్‌ (CM Jagan) ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని,  త్వరలో అందరూ నివ్వెరపోయేలా పరిణామాలు  ఉంటాయని తెలిపారు. విగ్రహాలు, రథాలు ధ్వంసంపై బీజేపీ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రాయలసీమ యాత్ర చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామని పేర్కొన్నారు.  ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 

Updated Date - 2022-08-21T21:41:08+05:30 IST