ఏప్రిల్ 7 నుంచి ప్రీపీహెచ్డీ పరీక్షలు
ABN , First Publish Date - 2021-03-02T05:52:39+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల పరిధిలో ఎంఫిల్, ప్రీపీహెచ్డీ పరీక్షలను ఏప్రిల్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కాలేజీ ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర కర్మార్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏయూ క్యాంపస్, మార్చి 1: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల పరిధిలో ఎంఫిల్, ప్రీపీహెచ్డీ పరీక్షలను ఏప్రిల్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కాలేజీ ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర కర్మార్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ ఏడున పేపర్-1, ఎనిమిదిన పేవర్-2, తొమ్మిదిన వైవా వాయిస్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయన్నారు. రాత పరీక్షలను కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం భవనంలో, వైవా వాయిస్ ప్రిన్సిపాల్ కార్యాలయంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు హాల్ టికెట్లను పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అందజేయడం జరుగుతుందన్నారు.