ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత

ABN , First Publish Date - 2021-10-26T07:03:45+05:30 IST

: మండలంలోని వేంపాడు గ్రామానికి చెందిన అమరా బుచ్చిబాబు, పసుమర్తి రవితేజలకు మంజూరైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు సోమవారం అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత
చెక్కు అందజేస్తున్న జడ్పీటీసీ రత్నరాజు

ముండ్లమూరు, అక్టోబరు 25 : మండలంలోని వేంపాడు గ్రామానికి చెందిన అమరా బుచ్చిబాబు, పసుమర్తి రవితేజలకు మంజూరైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు సోమవారం అందజేశారు. అమరా బుచ్చిబాబుకు రూ 24వేలు, పసుమర్తి రవితేజకు రూ 27వేలు మంజూరయ్యాయన్నారు. ఎమెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఈ ఫైళ్లపై ప్రత్యేక దృష్టిసారించి బాధితులకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ముండ్లమూరు సొసైటీ అధ్యక్షుడు బద్రి వెంకట సుబ్బారెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు అంబటి వెంకటేశ్వరరెడ్డి, గోపనబోయిన పిలీ్‌పరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T07:03:45+05:30 IST