ఆదర్శ రైతులకు ప్రశంసాపత్రాల అందజేత

ABN , First Publish Date - 2021-07-27T05:02:40+05:30 IST

వైఎ్‌సఆర్‌ రైతు చైతన్య యాత్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలోని ఒక ఆదర్శ పాడి రైతును ఎంపిక చేసి వారికి 5వేల రూపాయల ప్రోత్సాహక బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారు.

ఆదర్శ రైతులకు ప్రశంసాపత్రాల అందజేత

రాజంపేట, జూలై26 : వైఎ్‌సఆర్‌ రైతు చైతన్య యాత్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలోని ఒక ఆదర్శ పాడి రైతును ఎంపిక చేసి వారికి 5వేల రూపాయల ప్రోత్సాహక బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారు.  ఇందులో భాగంగా రాజంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆదర్శ రైతులను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సత్కరించారు. రాజంపేట మండలం పెద్దకారంపల్లె గ్రామం గుండాలపల్లెకు చెందిన కె.కృష్ణయ్యనాయుడు, నందలూరు మండలం కుమ్మరపల్లె గ్రామానికి చెందిన ఆదర్శ రైతు రావిళ్ల భాస్కర్‌కు ఈ పురస్కారాలు అందజేశారు. అదే విధంగా ఒంటిమిట్ట మండలం రాచపల్లె గ్రామ ఆదర్శ రైతు పి.రామ్‌ప్రసాద్‌రాజు, సిద్దవటం మండలం పెద్దపల్లె గ్రామ ఆదర్శ రైతు నాగం నరసింహారెడ్డికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పశు సంవర్ధక శాఖ ఉపసంచాలకుడు ఎన్‌.సురే్‌షరాజు, సహాయ సంచాలకుడు డాక్టర్‌ ప్రతాప్‌, డాక్టర్‌ ఎన్‌.శరత్‌కుమార్‌రెడ్డి, ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:02:40+05:30 IST