Droupadi Murmu: ముర్ముపై దేశం గంపెడాశలు పెట్టుకుంది: మాయావతి

ABN , First Publish Date - 2022-08-30T00:47:13+05:30 IST

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై దేశం గంపెడాశలు పెట్టుకుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చెప్పారు.

Droupadi Murmu: ముర్ముపై దేశం గంపెడాశలు పెట్టుకుంది: మాయావతి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై దేశం గంపెడాశలు పెట్టుకుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆమె ద్రౌపది ముర్మును కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల వేళ ముర్ముకు తమ పార్టీతో సహా దేశంలోని అనేక పార్టీలు మద్దతిచ్చాయని, భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారని మాయా గుర్తు చేశారు. వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యుంటే కొత్త చరిత్ర లిఖించినట్లు అయి ఉండేదని మాయా అభిప్రాయపడ్డారు. 





జులై 21న వెల్లడైన ఫలితాల్లో భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రప్రథమ ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము కావడం విశేషం. 



Updated Date - 2022-08-30T00:47:13+05:30 IST