నగరానికి చేరుకున్న రాష్ట్రపతి ఎన్నికల సామగ్రి
ABN , First Publish Date - 2022-07-13T18:35:26+05:30 IST
దేశ నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ సామగ్రి బెంగళూరు నగరానికి చేరుకుంది.
బెంగళూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): దేశ నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ సామగ్రి బెంగళూరు నగరానికి చేరుకుంది. మంగళవారం రాత్రి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సామగ్రిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్కుమార్ మీనా స్వయంగా స్వీకరించారు. అనంతరం వీటిని విధానసౌధలోని 108వ గదిలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసేంతవరకు స్ట్రాంగ్ రూం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.