కన్నుల పండువగా పద్మ అవార్డుల బహూకరణ కార్యక్రమం
ABN , First Publish Date - 2022-03-22T03:19:06+05:30 IST
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల బహూకరణ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల బహూకరణ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మ విభూషణ్ అవార్డ్ను (మరణానంతరం) జనరల్ బిపిన్ రావత్ కుటుంబ సభ్యులకు, రాధే శ్యామ్ ఖేమ్కా కుటుంబ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు, గుజరాత్కు చెందిన సచ్చిదానంద స్వామికి పద్మ భూషణ్ బహుకరించారు. తెలుగువారిలో మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు, కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్యలకు పద్మశ్రీ అవార్డులు బహుకరించారు. మొత్తం నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ బహుకరించారు. వీరిలో 34 మంది మహిళలున్నారు.