7న రాష్ట్రపతి మదనపల్లె పర్యటన
ABN , First Publish Date - 2021-01-17T04:48:04+05:30 IST
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫిబ్రవరి 7వ తేది మదనపల్లెకు రానున్నారని సబ్కలెక్టర్ జాహ్నవి పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, జనవరి 16: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫిబ్రవరి 7వ తేది మదనపల్లెకు రానున్నారని సబ్కలెక్టర్ జాహ్నవి పేర్కొన్నారు. శనివారం మదనపల్లె పట్టణ శివారులోని సత్సంగ్ ఆశ్రమానికి సబ్కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే నవాజ్బాషా, డీఎస్పీ రవిమనోహరాచారి వెళ్లి పరిశీలించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు, ప్రముఖ యోగా గురువు ముంతాజ్ అలీతో సబ్కలెక్టర్ చర్చించారు. 7న రాష్ట్రపతి సత్సంగ్ ఆశ్రమానికి విచ్చేస్తారని, 2గంటలపాటు గడుపుతారన్నారు. బీటీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అధికారులు ఉపక్రమించారు.