‘నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

ABN , First Publish Date - 2020-11-30T04:30:22+05:30 IST

నివర్‌ తుఫాన కారణంగా నిలువునా మునిగినరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర ఫైనాన్స కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ షేక్‌ మహబూబ్‌బాష డిమాండ్‌ చేశారు.

‘నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

బద్వేలు,నవంబరు29: నివర్‌ తుఫాన కారణంగా నిలువునా మునిగినరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర ఫైనాన్స కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ షేక్‌ మహబూబ్‌బాష డిమాండ్‌ చేశారు. ఆదివారం తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ నష్టపోయిన పంట పొలాలను వెంటనే పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంటపొలాలను గుర్తించి త్వరిత గతిన నష్టపరిహారాన్ని అందించేలా చొరవచూపాలన్నారు.  కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి కె.వేణుగోపాల్‌, బీసీ సేవాసంఘం డివిజన అధ్యక్షుడు గంటా వెంకటయ్య, జహంగీర్‌బాష పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T04:30:22+05:30 IST