కోవిడ్ సమయంలోనూ ఈసీ సమర్థవంతంగా విధులు నిర్వర్తించింది : రాంనాథ్ కోవింద్

ABN , First Publish Date - 2021-01-25T19:29:11+05:30 IST

కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించిందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

కోవిడ్ సమయంలోనూ ఈసీ సమర్థవంతంగా విధులు నిర్వర్తించింది : రాంనాథ్ కోవింద్

న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించిందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రశంసించారు. మహమ్మారి సమయంలోనూ సురక్షితంగా ఎన్నికలను నిర్వహించిందని కొనియాడారు. ‘జాతీయ ఓటరు దినోత్సవా’న్ని పురస్కరించుకొని రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపించారు. కోవిడ్ లాంటి క్లిష్టమైన సమయంలోనూ ఈసీ ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ విజయవంతమైన తరువాత, ఆ ప్రక్రియ నుంచి చాలా దేశాలు ప్రేరణ పొంది, అనేక దేశాలు దానిపై పరిశోధనలు చేయడానికి కూడా ఆసక్తి చూపించాయని కోవింద్ తెలిపారు. 

Updated Date - 2021-01-25T19:29:11+05:30 IST