Modiపై కౌంటర్‌తో ప్రెస్‌మీట్ మొదలుపెట్టిన KCR

ABN , First Publish Date - 2022-07-10T23:59:25+05:30 IST

ప్రధాని మోదీ (Prime Minister Modi)పై కౌంటర్‌తో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రెస్‌మీట్ మొదలుపెట్టారు.

Modiపై కౌంటర్‌తో ప్రెస్‌మీట్ మొదలుపెట్టిన KCR

హైదరాబాద్: ప్రధాని మోదీ (Prime Minister Modi)పై కౌంటర్‌తో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రెస్‌మీట్ మొదలుపెట్టారు. భారీ వర్షాలపై అధికారులతో ప్రగతిభవన్‌ (Pragati Bhavan)లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మోదీ ఏదో చేస్తాడనుకుంటే ఏమీ చేయకుండా.. రెండు దేవాలయాల పేర్లు చెప్పి వెళ్లిపోయారని ఎద్దేవాచేశారు. దేశాన్ని బీజేపీ (BJP) జలగలా పట్టి పీడిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని ఏం మాట్లాడారో ఆయనకే తెలియాలన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రధానిని అడిగానని, ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదని విమర్శించారు.


సమాధానం చెప్పకుండా తమ డొల్లతనం చూపించుకున్నారని దుయ్యబట్టారు. దేశానికి మోదీ సర్కార్ చేసిందేమీ లేదని కేసీఆర్ తెలిపారు. విపత్కార పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. జీహెచ్ఎంసీ (GHMC), ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. రెండు హెలికాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచామని వివరించారు. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల అన్ని జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశామని కేసీఆర్ తెలిపారు. 



Updated Date - 2022-07-10T23:59:25+05:30 IST