అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
ABN , First Publish Date - 2022-02-14T16:53:11+05:30 IST
పీఎస్ఎల్వి సి-52 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ/అమరావతి: పీఎస్ఎల్వి సి-52 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఈఓఎస్ - 04 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ, తోటలు, నేల తేమ, హైడ్రాలజీ, వరద మ్యాపింగ్ కోసం అన్ని వాతావరణ పరిస్థితులలో అధిక రిజల్యూషన్ చిత్రాలను అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.