Modi పర్యటన సందర్భంగా గచ్చిబౌలిలో పోలీస్ ఆంక్షలు
ABN , First Publish Date - 2022-05-25T18:28:53+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా గచ్చిబౌలిలో పోలీసులు ఆంక్షలు విధించారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా గచ్చిబౌలిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఐఎస్బీ 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్స్, మినీ ఎయిర్క్రాఫ్ట్లపై నిషేధం విధించారు. ఏరియల్ వ్యూ కోసం లైవ్ టెలికాస్ట్పై పోలీసులు నిషేధంచారు. అటు ఐఎస్బీ, హెచ్సీయూ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగనున్నాయి. రేపు(గురువారం) మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు బేగంపేట, ఐఎస్బీ, సెంట్రల్ యూనివర్సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. కాగా...రేపు(గురువారం) గచ్చిబౌలిలో ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.