ప్రధాని పర్యటన.. ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-28T04:37:16+05:30 IST

వచ్చేనెల 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌ రానున్న

ప్రధాని పర్యటన.. ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నేత వీరేందర్‌గౌడ్‌

శంషాబాద్‌రూరల్‌, జూన్‌ 27: వచ్చేనెల 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు ఢిల్లీ నుంచి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు రానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో బీజేపీ నేత వీరేందర్‌గౌడ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీవీఐపీలకు ప్రత్యేక రూట్‌ ఏర్పాటు చేయాలని విమానాశ్రయ అధికారులను వీరేందర్‌గౌడ్‌ కోరారు. ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ నాయకులు హైదరాబాద్‌లో ప్రధానిసభ ఏర్పాట్లను పరిశీలించారు. బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేసేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. 



Updated Date - 2022-06-28T04:37:16+05:30 IST