పదేళ్ల తర్వాత ఆ విద్యార్థే గొప్ప నాయకుడు కావొచ్చేమో!
ABN , First Publish Date - 2021-11-19T14:46:17+05:30 IST
మానవతా దృక్పథంతో..
సుప్రీం
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు పనిచేయకపోవడంతో సకాలంలో ఫీజు చెల్లించలేక ఇంజనీరింగ్ సీటును కోల్పోయిన దళిత విద్యార్థి విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని ఐఐటీ బాంబేని సుప్రీం కోర్టు కోరింది. కొన్నిసార్లు కోర్టులూ చట్టం పరిధి నుంచి బయటికొచ్చి ఆలోచించాలని, ఆ విద్యార్థే పదేళ్ల తర్వాత గొప్ప నాయకుడు కావొచ్చేమో అని వ్యాఖ్యానించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ప్రిన్స్ బల్బీర్ సింగ్ అనే దళిత విద్యార్థికి రిజర్వుడ్ కేటగిరీలో 864వ ర్యాంకు వచ్చింది. ఆన్లైన్ కౌన్సెలింగ్లో భాగంగా ఐఐటీ బాంబేలో సీటును అంగీకరిస్తూ ఫీజు చెల్లించే సందర్భంలో క్రెడిట్ కార్డు పనిచేయకపోవడంతో అడ్మిషన్ కోల్పోయాడు. దీనిపై ఐఐటీని సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు.