మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-03-07T04:54:43+05:30 IST
పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు.
నారాయణఖేడ్, మార్చి 6 : పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రాంవిలాస్ గల్లీలో రూ.10 లక్షల ప్రత్యేక నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. ఖేడ్ మున్సిపల్ పరిధిలో దాదాపు రూ.15 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో వివిధ పనులను చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రుబీనాబేగం నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, వార్డు కౌన్సిలర్ మహేంద్రకర్వివేకానంద్, నాయకుడు మహే్షరాం పాల్గొన్నారు. కాగా ఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించి కొత్తగా కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శివస్వాముల మహాపడిపూజను సతీమణి జయశ్రీరెడ్డితో కలిసి నిర్వహించారు.