అనకాపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2021-12-01T06:18:49+05:30 IST
అనకాపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గుడివా అమర్నాథ్ చెప్పారు.
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి, నవంబరు 30: అనకాపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గుడివా అమర్నాథ్ చెప్పారు. జోనల్ కార్యాలయంలో ప్రభుత్వం పంపిణీ చేసిన తడి-పొడి చెత్త సేకరణ వాహనాలను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని 27 సచివాలయాలకు 27 వాహనాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని తడి-పొడి చెత్తను వేర్వేరుగా వాహనాలకు అందజేయలన్నారు. కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మందపాటి సునీత, కార్పొరేటర్లు జాజుల లక్ష్మిప్రసన్న, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నాయకులు మందపాటి జానకిరామరాజు, బొడ్డేడ శివ, పలకా రవి, జాజుల రమేశ్ కొణతాల భాస్కరరావు పాల్గొన్నారు.