రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ఉద్యోగిని మృతి

ABN , First Publish Date - 2022-06-25T05:48:24+05:30 IST

మద్దిపాడు మండలం సీతారామపురం కొష్టాలు వద్ద గల జాతీయరహరదాపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో మహిళా ఉ ద్యోగి మృతి చెందగా, తన సహచరరాలు తీవ్రంగా గాయపడింది.

రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ఉద్యోగిని మృతి

మరొకరికి తీవ్ర గాయాలు


మద్దిపాడు, జూన్‌ 24: మద్దిపాడు మండలం సీతారామపురం కొష్టాలు వద్ద గల జాతీయరహరదాపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో మహిళా ఉ ద్యోగి మృతి చెందగా, తన సహచరరాలు తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు నగరం కమ్మపాలెంకు చెందిన నీలా పావని(30), పెళ్లూరుకు చెందిన దాసరి వినీల స్థానిక యాక్సెస్‌ బ్యాంకు అకౌంట్స్‌ సెక్షన్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు తమ విధుల నిమిత్తం స్కూటీపై బొల్లాపల్లికి బయలుదేరారు. అయితే సీతారామపురం కొష్టాలు జం క్షన్‌ వద్దకు వచ్చిన సమయంలో వారు ఓ కంటైనర్‌ను వెనుక వైపు ఢీకొట్టారు. దీంతో పావని రోడ్డు మీద పడి తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందింది. అలాగే స్కూటీపై ఉన్న దాసరి వినీల మీదకు లారీ టైర్లు ఎక్క డంతో తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఒంగోలు రూరల్‌ సీఐ రాంబాబు, ఎస్‌ఐ శ్రీరామ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వి నీలను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరువాత మెరు గైన వైద్యం కోసం సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. పావని మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.  


Updated Date - 2022-06-25T05:48:24+05:30 IST