ప్రైవేటు దోపిడీ
ABN , First Publish Date - 2021-04-14T04:05:13+05:30 IST
జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతునే ఉంది. మర ణాల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రైవేట్ ఆసుపత్రులకు కాసులు కురిపిస్తున్న కరోనా సెకండ్ వేవ్
సౌకర్యాలు, అర్హులైన వైద్యులు లేకున్నా కొవిడ్ చికిత్సలు
జిల్లా కేంద్రంలో చెస్ట్ స్కానింగ్ల పేరుతో భారీ దోపిడీ పర్వం
రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు
బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు
జిల్లాలో 16 వేలకు పైగా కరోనా కేసులు
కామారెడ్డి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతునే ఉంది. మర ణాల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జిల్లాలోని చాలా మండలాల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కేసుల సంఖ్య సైతం 16 వేలకు పైగానే ఉన్నా రికవరి కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నప్పటికీ వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులు ఎక్కువగా మరణిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారితో రోజు రోజుకూ జన ం వణికిపోతుంటే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం కాసుల వేటకే ప్రాధాన్యతనిస్తున్నాయి. కరోనాపై నెలకొ న్న భయం కారణంగా ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు ఎంత ఫీజు అయినా చెల్లిస్తుండడంతో ప్రభుత్వ ఉత్తర్వు లు కాగితాలకే పరిమితం అయ్యాయి. పైగా వసూలు చేస్తున్న ఫీజులకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ఆయా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. కేవలం ఐదు, ఆరు రోజుల చికిత్సకే లక్షల రూపాయల బిల్లులు ప్రైవే ట్ ఆసుపత్రులు తీసుకుంటుంటే మరికొందరు హైదరా బాద్ లాంటి ప్రాంతాలకు రిఫర్ చేసి కమీషన్ రూపం లో లక్షలు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇక మరికొన్ని ఆసుపత్రి యాజమాన్యాలు అరు వుకు తీసుకువచ్చిన వైద్యులతో ఓపీలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధులని తెలిసినా కమీషన్ల కోసం పరీక్షలకు రిఫర్ చేస్తూ కాసులు దండుకుంటున్నారు. చిన్నపాటి జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తే అన్ని పరీక్షలు చేయిస్తున్నారు. ఒకవేళ జలుబు, దగ్గు లాంటివి ఉంటే ముందుగా ఎక్స్రే లాంటివి చేయించకుండా నేరుగా చెస్ట్ స్కాన్ చేయించుకోవాలంటూ రిఫర్ చేస్తున్నారు. అక్కడి కి వెళితే గతంలో రూ.2వేలు తీసుకునే నిర్వాహకులు దొరికిందే తడవుగా రూ.5వేల వరకు వసూలు చేస్తూ అందులోంచి రిఫర్ చేసిన వైద్యులకు కమీషన్ రూపం లో అందిస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను అప్పుల ఊబిలోకి తోస్తున్నారు. జిల్లాలో పలు ఆసుపత్రులలో సౌకర్యాలు, అర్హతలేని వైద్యులు చికిత్స అందిస్తూ లక్షల్లో వసూలు చేస్తున్న విషయం తెలిసినా జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సగం రోజులే చికిత్స అందించి హోంక్వారంటైన్లో ఉండాలని సూచన
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్సలు అందిం చేందుకు సరిపడా బెడ్లు లేకపోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా అక్కడ సైతం బెడ్లు ఫుల్ అవుతుండడంతో ఏమీ చేయలేక కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకు ంటున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితుడిని చేర్చుకొని చికిత్స అందించి కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయడానికి కనీసం రెండు వారాల సమయం తీసుకుంటుండగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం ఐదు, ఆరు రోజులు మాత్రమే చికిత్స అందించి డిశ్చార్జ్ చేసి హోం క్వారంటై న్లో చికిత్స తీసుకోవాలంటూ సలహాలు ఇస్తూ బిల్లుల ను మాత్రం పూర్తిస్థాయిలో వసూలు చేస్తున్నారనే విమ ర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం కాసుల కోసమే చికిత్సలు తప్ప రోగి ఆరోగ్య పరిస్థితి ఎటుపోతే తమకేం టి అనే ధోరణి ప్రదర్శిస్తూ ముందుగా వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తే మరికొందరు బాధితులను చేర్చుకుని ఫీజు లు వసూలు చేసుకోవచ్చన్న ఆలోచన చేస్తున్నట్లు తెలు స్తోంది. వాస్తవానికి కరోనా చికిత్సలు అందించేందుకు ఒక పలమానాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ సేవలు అత్యంత కీలకం. కానీ ఇప్పుడు వారేమి అవసరం లేదు. ఒక జన రల్ ఫిజీషియన్ గంట సేపు కన్సల్టెంట్గా వస్తే చాలు కరోనా చికిత్సకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఆసుపత్రి పెట్టడానికి అర్హత లేని వారు సైతం కమీషన్లకు ఇతరుల సర్టిఫికెట్లు పెట్టి ఆసుపత్రులను ఏర్పాటు చేస్తూ కన్సల్టెంట్గా వచ్చిన వైద్యునికి ఇంత అని టార్గెట్ పెడుతూ చికిత్స కోసం వచ్చిన వారి నాడిపట్టకుం డానే దోపిడీ పర్వానికి తెరలేపుతున్నారు. జలుబు, దగ్గు వస్తే చాలు ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షలు చేయించు కొని రావాలంటూ సూచించడం పాజిటివ్ వస్తే ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన మందులకు నయం కాదంటూ రోగుల కు భయాన్ని కలిగిస్తూ సొంత మందుల దుకాణాల్లో కొనుగోలు చేసేలా మాయలు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి లాంటి పట్టణ ప్రాంతాల్లో ఈ దోపిడీ పర్వం జరుగుతున్నా అధి కార యంత్రాంగం వీటిపై దృష్టి సారించకపోతే ఆర్ఎం పీలు కూడా చికిత్స అందించడం ఖాయంగా కనిపిస్తోం దని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అవసరం లేకున్నా స్కానింగ్, డయాగ్నస్టిక్ పరీక్షలు చేయిస్తూ దోపిడీ
జిల్లాలోని ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు కరోనా పరీక్షలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుండడంతో ఓపీ సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. కరోనా లక్షణాలు లేవని తెలిసినా ఆసుపత్రిలో ఓపీ తీసు కొని చికిత్స నిమిత్తం వస్తున్న ప్రతీ ఒక్కరికి ముందుగా చెస్ట్స్కాన్ చేయించుకొని రావాలని తమకు అనుకూలం గా ఉన్న, కమీషన్లు ఎక్కువగా ఇచ్చే స్కానింగ్ సెంటర్లకు వైద్యులు రిఫర్ చేస్తున్నారు. దీంతో అవసరం లేకున్నా స్కానింగ్ చేస్తూ ప్రజల నుంచి వేలలో వసూలు చేస్తూ కాసులను దండుకుంటున్నారు. చెస్ట్ స్కానింగ్ నిబంధ నల మేరకు కాకుండా రూ.5వేల నుంచి రూ.10వేల వర కు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. బ్లడ్, యూరిన్ టెస్టుల పేరిట వసూలు చేస్తున్నారు. ఎక్కువగా ఈ తతా ంగం జిల్లా కేంద్రంలోనే జరుగుతున్నా వైద్యఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కరోనా వేళ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంటున్న విషయం ప్రతీ ఒక్కరికి తెలిసినా తమకు మాత్రం కాసు లే కావాలని ఇతరుల ఆరోగ్యం ఎటుపోతే తమకేంటి అనే ధోరణి ప్రదర్శిస్తుండడం తమ వద్ద సరిపడా డబ్బులేకు న్నా అప్పులు చేసి మరీ నిర్వాహకులకు చెల్లిస్తున్నారు. ఈ దోపిడీ పర్వం జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా జరుగు తున్నా పలు సందర్భాల్లో తనిఖీలకు వెళ్లినప్పుడు ఎంతో కొంత ముట్టజెబుతున్నారుగా తమకేందుకులే అనే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారనే వాదనలు సొంత శాఖలోని సి బ్బంది నుంచి వెలువడుతున్నాయంటే జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. వాస్తవానికి కరోనా లక్షణాలు ఉంటే నిపు ణులైన వైద్యులు ఎక్స్రేకు ముందుగా ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందులో ఏదైన అనుమానిత లక్షణాలు ఉంటేనే స్కానింగ్కు రిఫర్ చేస్తూ తీవ్రత ఉంటే హైదరా బాద్, నిజామా బాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలని సూచించడమో లేదంటే హోం క్వారంటైన్లో ఉంటూ తగు జాగ్రత్తలు పాటిస్తు పలు మందులను వాడాలని సూచిస్తున్నారు.
16 వేలకు పైగా కరోనా కేసులు
జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ వేగంగా విస్తరి స్తోంది. గత ఏడాది లాక్డౌన్ సడలింపు తర్వాత ప్రతీరో జు వందకు మించి కేసులు నమోదు కాలేదు. కానీ ప్రస్తుతం ఈ నెల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అమా ంతంగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 400లకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 16,935 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగ ళవారం మరో 209 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్ప టి వరకు 14,203 మంది కరోనా జయించి కోలుకున్నారు. ప్రస్తుతం 2,732యాక్టివ్ కేసులు ఉన్నాయి. సంవత్సర కా లంలో కరోనా ద్వారా 62 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధిగ్ర స్తులు వృద్ధులే ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. బుధవారం మద్నూర్ మండలం పోడిచిరలో కరోనాతో హైదరాబాద్ గాంఽధి ఆసుపత్రిలో మృతి చెందాడు.