రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం
ABN , First Publish Date - 2021-02-28T05:27:45+05:30 IST
శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద జాతీయ రహదారిపై శని వారం జరిగిన ప్రమాదంలో మెండ అరుణ అనే ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం చెందారు.
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద జాతీయ రహదారిపై శని వారం జరిగిన ప్రమాదంలో మెండ అరుణ అనే ప్రైవేట్ లెక్చరర్ దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. నరసన్నపేట మండలం కొర్లాం గ్రామానికి చెందిన అరుణ శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీలో నివసిస్తున్నారు. ఈమెకు చిన్న పాప ఉంది. భర్త హైదరాబాద్లో ఉంటున్నారు. అరుణ మున్సబ్పేటలోని గాయత్రి కళాశాలలో బోటనీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వస్తుండగా పెద్దపాడు వద్ద బోల్తాపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఆమెపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.