ప్రైవేటు టీచర్లను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-04-23T16:28:20+05:30 IST

‘‘కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి. ఇప్పటికి రాష్ట్రంలో 25 మంది ప్రైవేటు టీచర్లు మరణించినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. తక్షణం స్పందించి వారికి కరోనా ప్యాకేజి ప్రకటించాలి’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ప్రైవేటు టీచర్లను ఆదుకోండి

సీఎంకు అచ్చెన్నాయుడు లేఖ

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి. ఇప్పటికి రాష్ట్రంలో 25 మంది ప్రైవేటు టీచర్లు మరణించినా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. తక్షణం స్పందించి వారికి కరోనా ప్యాకేజి ప్రకటించాలి’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.   ప్రభుత్వం స్పందిం చి  ఉపాధి కోల్పోయిన ప్రైవేటు బోధన, బోధనేతర సిబ్బందికి కరోనాప్యాకేజి కింద నెలకు రూ.10 వేలు భృతి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-23T16:28:20+05:30 IST