493వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

ABN , First Publish Date - 2021-04-23T13:20:22+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 493వ రోజుకి చేరుకున్నాయి

493వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 493వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు అంటున్నారు. రాజధాని రైతులు కరోనా సూచనలు పాటిస్తూ నిరసనలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు సాధిస్తామంటూ..విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు, మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు.

Updated Date - 2021-04-23T13:20:22+05:30 IST