సోనియా తర్వాత Priyanka Gandhiకి కూడా కరోనా
ABN , First Publish Date - 2022-06-03T16:20:13+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత ఆమె తనయ ప్రియాంక గాంధీకి కూడా శుక్రవారం కరోనా సోకింది....
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత ఆమె తనయ ప్రియాంక గాంధీకి కూడా శుక్రవారం కరోనా సోకింది.తనకు తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని ప్రియాంకగాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం తాను హోం క్వారంటైన్లో ఉన్నానని ప్రియాంక పేర్కొన్నారు. తనను కలిసిన వారు, పరిచయం ఉన్నవారు కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రియాంకగాంధీ సూచించారు.బుధవారం సాయంత్రం సోనియాగాంధీకి స్వల్ప జ్వరం వచ్చిందని, కొన్ని కొవిడ్ లక్షణాలు ఉండడంతో గురువారం ఉదయం ఆమెకు కరోనా పరీక్ష చేశారు. ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
ప్రస్తుతం సోనియా ఐసొలేషన్లో ఉన్నారని, ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతోందని తెలిపారు. గత వారం రోజులుగా సోనియా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారని, వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించామని సుర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోనియా బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు.