మాయావతిని కలుసుకున్న ప్రియాంక గాంధీ వాద్రా

ABN , First Publish Date - 2021-11-14T21:42:19+05:30 IST

మాయావతి మాతృమూర్తి రాంరతి మరణించినట్లు ఆ పార్టీ శనివారం సాయంత్రం పేర్కొంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం తుది శ్వాస విడిచినట్లు పార్టీ తెలిపింది. ప్రస్తుతం ఆమె..

మాయావతిని కలుసుకున్న ప్రియాంక గాంధీ వాద్రా

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతిని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కలుసుకున్నారు. ఢిల్లీలోని మాయావతి తల్లిదండ్రుల నివాసానికి వచ్చిన ప్రియాంక గాంధీ.. మాయావతిని ఓదార్చారు. మాయావతి తల్లి రాంరతి శనివారం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.


మాయావతి మాతృమూర్తి రాంరతి మరణించినట్లు ఆ పార్టీ శనివారం సాయంత్రం పేర్కొంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం తుది శ్వాస విడిచినట్లు పార్టీ తెలిపింది. ప్రస్తుతం ఆమె వయసు 92 సంవత్సరాలు. గతేడాది నవంబర్ 19న మాయావతి తండ్రి ప్రభుదయాల్ మరణించారు. ఆయన మరణించి ఏడాది కూడా గడవకముందే రాంరతి మరణించారు.

Updated Date - 2021-11-14T21:42:19+05:30 IST