యూపీ కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రియాంక గాంధీ వాద్రా సమావేశం

ABN , First Publish Date - 2021-08-29T16:23:13+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాన

యూపీ కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రియాంక గాంధీ వాద్రా సమావేశం

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సమాయత్తమవుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆమె ఆదివారం వర్చువల్ విధానంలో మాట్లాడారు. ఎన్నికలకు సిద్ధమవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చిన్న పార్టీలతో పొత్తులకు సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు. 


1989 నుంచి, అంటే 32 సంవత్సరాల నుంచి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదన్నారు. 2017లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామని, దాని వల్ల సానుకూల ఫలితాలు రాలేదని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకు చాలా ముఖ్యమైనవని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 100 రోజుల్లో దాదాపు 700 శిక్షణ శిబిరాలను నిర్వహించి కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘పరీక్షణ్ సే పరాక్రమ్-కాంగ్రెస్ విజయ్ సేన నిర్మాణ్’ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మొత్తం మీద రెండు లక్షల మందికి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు. 


Updated Date - 2021-08-29T16:23:13+05:30 IST