విజేతలకు బహుమతుల ప్రదానం

ABN , First Publish Date - 2022-08-11T04:53:20+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పీడీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో బుధవారం క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, జేసీ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

విజేతలకు బహుమతుల ప్రదానం
క్విజ్‌ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, ఆగస్టు 10: ఆజాదీకా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పీడీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో బుధవారం క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, జేసీ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 30 మండలాల నుంచి మొత్తం 90 టీంలు క్విజ్‌ పోటీల్లో పాల్గొనగా అన్ని టీంలకు సెమీ ఫైనల్స్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో 6 టీమ్‌లను ఎంపిక చేసి ఫైనల్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన 3 టీంలకు మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండవ బహుమతిగా రూ.7,500, మూడవ బహుమతిగా రూ.5 వేలు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో రంగస్వామి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డి, డీఈవో రాఘవరెడ్డి, కలెక్టరేట్‌ తహసీల్దార్‌ శ్రావణి, పీఆర్‌టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరాజు, వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T04:53:20+05:30 IST