ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-07-24T06:25:55+05:30 IST

ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది స్థానిక ఎంపీడీవో షేక్‌ జమీవుల్లాకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఇవ్వండి
ఎంపీడీవో జమీవుల్లాకి వినతిపత్రం అందజేస్తున్న సచివాలయ సిబ్బంది


పరీక్షల పేరుతో మానసికంగా ఇబ్బంది పెట్టొదు

ఎంపీడీవోకి వినతిపత్రం ఇచ్చిన సచివాలయ ఉద్యోగులు

సింగరాయకొండ, జూలై 23 : ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది స్థానిక ఎంపీడీవో షేక్‌ జమీవుల్లాకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ఉద్యోగికి కూడా ప్రొబిషన్‌ కాలం నిర్థారించుటకు పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు. ప్రభుత్వం వెన్నంటి నడుస్తున్న సచివాలయ ఉద్యోగులను పరీక్షల పేరుతో మానసిక క్షోభకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇంకో రెండు నెలల్లో ప్రొబేషన్‌ కాలం పూర్తిచేసుకుంటున్న తరుణంలో, కొత్తగా పరీక్ష, శిక్షణ, 75 శాతం హాజరు కూడా తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో నిరాశ నిస్పృహాలకు లోనైట్లు సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలని కోరారు. 

Updated Date - 2021-07-24T06:25:55+05:30 IST