ఎన్ఎస్ఈ మాజీ అధిపతి స్టేట్మెంట్ తీసుకున్న ఈడీ!
ABN , First Publish Date - 2022-05-24T23:03:23+05:30 IST
తీహార్ జైలులో ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణను ఈ రోజు (మంగళవారం) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది.
తీహార్ జైలులో ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణను ఈ రోజు (మంగళవారం) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఆమె స్టేట్మెంట్ నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ కేసు, బౌర్స్ లో అవకతవకల ఆరోపణలతో చిత్రా రామకృష్ణను మార్చి 6వ తేదీన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు.
మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ అయిన ఈడీ కూడా ఈ కేసును విచారిస్తోంది. అలాగే ఎన్ఎస్ఈలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ కూడా దర్యాఫ్తు చేస్తోంది. 2013 ఏప్రిల్ 1న చిత్ర ఎన్ఎస్ఈ ఎమ్డీ, సీఈవోగా నియమితులయ్యారు. తన చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్గా ఆనంద్ సుబ్రమణియన్ను నియమించడంలోజరిగిన అవకతవకలకు సంబంధించి ఇటీవల ఆరోపణలు వచ్చాయి. అలాగే కో-లొకేషన్ స్కామ్ ఆరోపణలు బయటకు వచ్చాయి. కో-లొకేషన్ కేసులో ప్రమేయం ఉన్న బ్రోకర్ల ఇళ్లల్లోలోనూ గత నెలలో ఈడీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది.