సమస్యల పరిష్కారమే అజెండా కావాలి
ABN , First Publish Date - 2021-12-08T06:08:33+05:30 IST
గ్రామాల అభివృద్ధే అందరి లక్ష్యం కావా లని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. నక్కపల్లి మండల పరిషత్ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ వై.రత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఎంపీటీసీ, సర్పంచ్లు పనిచేయాలన్నారు.
నక్కపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు ఎమ్మెల్యే బాబూరావు సూచన
నక్కపల్లి, డిసెంబరు 7 : గ్రామాల అభివృద్ధే అందరి లక్ష్యం కావా లని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. నక్కపల్లి మండల పరిషత్ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ వై.రత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఎంపీటీసీ, సర్పంచ్లు పనిచేయాలన్నారు. మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తదుపరి సమావేశంలో ప్రతి సభ్యుడు తమ గ్రామాల ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎంపీడీవో రమేశ్రామన్, వైఎస్ ఎంపీపీ వీసం నానాజీ, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, ఈవోపీఆర్డీ సీతారామరాజు, పీఏసీఎస్ అధ్యక్షులు వీసం రామకృష్ణ, పాపారావు, మణిరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహ హక్కు పథకంలో భాగంగా ఓటీఎస్పై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవ ద్దన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.