ఇందిరమ్మ కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-10-26T05:56:14+05:30 IST
ఇందిరమ్మ కాలనీ-2లో సమస్యలు పరిష్కరించాలని భారతీయ మజ్దూర్ సంఘ నాయకుడు పీవీ కృష్ణారావు కోరారు.
మార్కాపురం, అక్టోబరు 25: ఇందిరమ్మ కాలనీ-2లో సమస్యలు పరిష్కరించాలని భారతీయ మజ్దూర్ సంఘ నాయకుడు పీవీ కృష్ణారావు కోరారు. స్థానిక ఆర్డీవో కా ర్యాలయంలో సోమవారం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఆమెను కలిసిన బీఎంఎస్ నాయకులు ఇందిరమ్మ కాలనీ నిర్మాణం ప్రారంభించి పుష్కరకాలం గడిచిందని, కానీ నేటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభు త్వాలు విఫలమయ్యాయన్నారు. అక్కడ భూ సమస్యలపై కూడా వినతిపత్రాలను ప్రజలు అందజేశారు.