సకాలంలో సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-10-27T05:08:33+05:30 IST
ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆర్డీవో కనకనరసారెడ్డి ఆదేశించారు.
రేణిగుంట, అక్టోబరు 26: ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆర్డీవో కనకనరసారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని తూకివాకం సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందిన అర్జీలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ... ప్రభుత్వ లబ్ధి అందుతున్న ఆశతో ప్రజలు సచివాలయాలను ఆశ్రయిస్తారని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మునిశేఖర్రెడ్డి, కార్యదర్శి షణ్ముగం, వీఆర్వో చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.