సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-01-16T05:09:29+05:30 IST

పదవీ విరమణ చెందిన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం అందించారు.

సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను సన్మానిస్తున్న ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌

ఎంపీ బండి సంజయ్‌కి వినతిపత్రం అందజేసిన ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులు

భగత్‌నగర్‌, జనవరి 15: పదవీ విరమణ చెందిన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం అందించారు. ఆర్టీసీలో రిటైర్డ్‌ అయిన కార్మికులకు పెన్షన్‌ నెలకు 500, 1000 రూపాయలు మాత్రమే వస్తోందన్నారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కనీస పెన్షన్‌ను 7500 రూపాయలకు పెంచాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఎంపీ సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా ఎంపీని శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి నాగేశ్వర్‌ రావు, జిల్లా అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:09:29+05:30 IST