సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-03-09T06:11:16+05:30 IST
ఏజెన్సీ పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
- ఐటీడీఏను ముట్టడించిన ఆశావర్కర్లు
రంపచోడవరం, మార్చి 8: ఏజెన్సీ పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్యకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకురాలు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ ఏజెన్సీలో ఎన్నో కష్ట,నష్టాలను అధిగమించి గిరిజన ప్రజలకు సేవలందిస్తుంటే ఆశాల సమస్యలు పరిష్కరించడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన నాయకులు కె.చెల్లాయమ్మ, కె.రమణమ్మ, కె.వీరలక్ష్మి, లాలిబాయి, సీఐటీయూ నాయకులు కె.శాంతిరాజు, గిరిజన సంఘం నాయకులు టి.శ్రీనివాస్, ఈ.సిరిమల్లిరెడ్డి పాల్గొన్నారు.