ఇబ్బందులు తాళ్లలేక ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-16T06:39:50+05:30 IST
రాజమహేంద్రవరం తాడితోట రెల్లిపేటలో ఓ మహిళ ఇబ్బందులు తాళ్లలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది.
రాజమహేంద్రవరం సిటీ, మే 15: రాజమహేంద్రవరం తాడితోట రెల్లిపేటలో ఓ మహిళ ఇబ్బందులు తాళ్లలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన వై.భవాని(40) భర్త చనిపోవడం, అటుపై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తన కుమార్తెకు వివాహం చేసింది. అయితే కుమార్తె భర్తతో విడాకులు తీసుకుని పుట్టింటికి రావడం వంటి సమస్యలతో భవాని సతమతమౌతోంది. ఈ నేపథ్యంలో భవాని పుట్టిల్లు రాజమహేంద్రవరం రెల్లిపేటకు వచ్చి తన తల్లి పైరమ్మకు చెప్పుకుంది. శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన తల్లి వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న భవాని పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం మృతిచెందింది. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.