ఘోషించిన వేదం..పులకించిన భక్తజనం

ABN , First Publish Date - 2022-03-09T06:59:14+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఽశ్రీకాళహస్తీశ్వరాలయంలోని దక్షిణామూర్తి వద్ద, దూర్జటి కళాప్రాంగణంలో వేదం ఘోషించడంతో భక్తజనం పులకించారు. ధూర్జటి కళాప్రాంగణంలో చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు సందర్భంగా రాష్ట్ర ప్రముఖ దేవాలయాలకు చెందిన వేదపండితులకు వేద పండిత సభ జరిగింది

ఘోషించిన వేదం..పులకించిన భక్తజనం
ఆలయంలో వేదపఠనంచేస్తున్న పండితులు

శ్రీకాళహస్తి, మార్చి 8: శ్రీకాళహస్తీశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఽశ్రీకాళహస్తీశ్వరాలయంలోని దక్షిణామూర్తి వద్ద, దూర్జటి కళాప్రాంగణంలో వేదం ఘోషించడంతో భక్తజనం పులకించారు. ధూర్జటి కళాప్రాంగణంలో చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు సందర్భంగా రాష్ట్ర ప్రముఖ దేవాలయాలకు చెందిన వేదపండితులకు వేద పండిత సభ జరిగింది. ఇందులో భాగంగా శ్రీశైలం, తిరుపతి, కాణిపాకం, పెనుగ్రంచిపోలు, విజయవాడ, అమరావతి, శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన పండితులు వేద పారాయణం చేశారు. ముందుగా ఆలయ ఈవో పెద్దిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి పండిత సభను ప్రారంభించారు. మొత్తం 40మంది పండితులు నాలుగు వేదాలను పఠించారు. వేద శ్రవణంతో భక్తులు పరవశించారు. అనంతరం ఆలయ ఈవో పండితులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంబంధం గురుకుల్‌, కరుణా గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-09T06:59:14+05:30 IST