రైఫిల్‌ షూటింగ్‌లో ప్రొద్దుటూరు విద్యార్థి ప్రతిభ

ABN , First Publish Date - 2021-03-01T04:50:37+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు గచ్చిబౌలీ స్టేడియంలో నేషనల్‌ రైఫిల్‌ అసో సియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన స్టేట్‌మీట్‌లో ప్రొద్దుటూరు విద్యార్థి మూర్తి విష్ణుయశ్వంత్‌ మూడో స్థా నం నిలిచాడు.

రైఫిల్‌ షూటింగ్‌లో   ప్రొద్దుటూరు విద్యార్థి ప్రతిభ
రైఫిల్‌ షూటింగ్‌లో మూడవ స్థానం సాధించిన మూర్తి విష్ణుయశ్వంత్‌ను అభినందిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు రూరల్‌, ఫిబ్రవరి 28: తెలంగాణ  రాష్ట్రంలోని హైదరాబాదు గచ్చిబౌలీ స్టేడియంలో నేషనల్‌ రైఫిల్‌ అసో సియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన స్టేట్‌మీట్‌లో ప్రొద్దుటూరు విద్యార్థి  మూర్తి విష్ణుయశ్వంత్‌ మూడో స్థా నం నిలిచాడు. ఈ విద్యార్థికి ఇండియన్‌ ఒలంపిక్‌ గోల్డ్‌ మె డలిస్ట్‌ గగన్‌ నారంగ్‌ చేతుల మీదుగా ఫిస్టల్‌ ఈవెంట్‌ బ్రాంజ్‌ మెడల్‌ను బహూ కరించారు. ఈ విద్యార్థి మూడేళ్లు గా జార్జిక్లబ్‌లో రైఫిల్‌ షూటింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు విద్యార్థి తండ్రి మూర్తినరసింహులు పేర్కొన్నారు. తన కుమారుడు రాష్ట్ర స్థాయి రైఫిల్‌ షూటింగ్‌లో మూడోస్థానం సాధించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-03-01T04:50:37+05:30 IST