ఏయూ దూరవిద్య డైరెక్టర్గా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు
ABN , First Publish Date - 2021-03-02T05:57:09+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (దూరవిద్య కేంద్రం) డైరెక్టర్గా వర్సిటీ సోషల్ వర్క్ విభాగం ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు నియమితులయ్యారు.
ఏయూ క్యాంపస్, మార్చి 1: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (దూరవిద్య కేంద్రం) డైరెక్టర్గా వర్సిటీ సోషల్ వర్క్ విభాగం ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్రెడ్డి ఉత్తర్వులు జారీచే శారు. ఇప్పటివరకు దూరవిద్య కేంద్రం డైరెక్టర్గా పనిచేసిన హరిప్రకాశ్ పదవీ విరమణ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. కాగా సోమవారం హరిప్రకాశ్ నుంచి విశ్వేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూరవిద్యకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు.