జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో పురోగతి
ABN , First Publish Date - 2022-03-19T22:02:20+05:30 IST
నగరంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో పురోగతి కలిగింది. ప్రమాదానికి కారణమైన నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారు నడిపిని వ్యక్తిని సయ్యద్ అఫ్నాన్(19)గా గుర్తించారు. అఫ్నాన్తో పాటు యువకుడు రసూల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికులు, బాధితుల సమాచారంతో నిందితులను పోలీసులు గుర్తించారు. డీసీపీ కార్యాయంలో నిందితులు అఫ్నాన్, రసూల్లను పోలీసులు ఉంచారు.