ప్రాజెక్టు గేట్లను వెంటనే పునరుద్ధరించి నీటిని నింపుతాం: ఎంపీ

ABN , First Publish Date - 2020-11-30T04:49:45+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టులో దెబ్బతిన్న గేట్లను వెంటనే పునరుద్ధరించి ప్రాజెక్టులో నీటిని నింపుతామని, అదే విధంగా త్వరలో అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందజేసినట్లు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించారు.

ప్రాజెక్టు గేట్లను వెంటనే పునరుద్ధరించి   నీటిని నింపుతాం: ఎంపీ
అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి

రాజంపేట, నవంబరు29 : అన్నమయ్య ప్రాజెక్టులో దెబ్బతిన్న గేట్లను వెంటనే పునరుద్ధరించి ప్రాజెక్టులో నీటిని నింపుతామని, అదే విధంగా త్వరలో అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందజేసినట్లు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్టు అధికారులతో సాంకేతికంగా ఏర్పడ్డ ఇబ్బందుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి పాల్గొన్నారు.


 

Updated Date - 2020-11-30T04:49:45+05:30 IST