వైసీపీ నాయకుల స్వలాభం కోసమే ప్రాజెక్టులు : అమర్నాథ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-07T00:34:44+05:30 IST

చిత్తూరు: మదనపల్లి టీడీపీ మినీ మహానాడు వేదికపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి మదనపల్లికు కృష్ణా నది జలాలు తీసుకొస్తే.. వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి ప్రజలకు తాగు,

వైసీపీ నాయకుల స్వలాభం కోసమే ప్రాజెక్టులు : అమర్నాథ్ రెడ్డి

చిత్తూరు: మదనపల్లి టీడీపీ మినీ మహానాడు వేదికపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి మదనపల్లికు కృష్ణా నది జలాలు తీసుకొస్తే..  వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి  ప్రజలకు తాగు, సాగునీరు అందకుండా చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నాయకుల స్వలాభం కోసమే పుంగనూరు తంబళ్లపల్లె మండలంలో మినీ రిజర్వాయర్ల పేర్లతో ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు.  జగన్ పాలన, పథకాల గురించి ప్రశ్నించిన వారిపై ఆక్రమ కేసులు పెట్టడం రివాజుగా మారిందని, బెదిరింపులు, కేసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-07T00:34:44+05:30 IST