ఏఎ్సఓకు డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి
ABN , First Publish Date - 2021-07-27T04:39:41+05:30 IST
చెన్నూరు తహసీల్దారు కార్యాలయంలో సహాయ గణాంకాధికారిగా పనిచేస్తున్న కామేశ్వరికి డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి లభించింది.
చెన్నూరు, జూలై 26 : చెన్నూరు తహసీల్దారు కార్యాలయంలో సహాయ గణాంకాధికారిగా పనిచేస్తున్న కామేశ్వరికి డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి లభించింది. ఈమె కడప కలెక్టరేట్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దారు అనురాధ మాట్లాడుతూ దాదాపు మూడేళ్లుగా తహసీల్దారు కార్యాలయంలో అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. అనంతరం తహసీల్దారుతో పాటు డీటీ క్రిష్ణారెడ్డి, వ్యవసాయాధికారి రమే్షరెడ్డి, కార్యాలయ సిబ్బంది, పదోన్నతిపై వెళుతున్న ఏఎ్సఓను ఘనంగా సన్మానించారు.