ఎంపీడీవోలకు పదోన్నతి నియామక పత్రాలు
ABN , First Publish Date - 2022-08-13T05:59:03+05:30 IST
ప్రమోషన్ పొందిన ఎంపీడీవోలకు శుక్రవారం చిత్తూరులోని ఆర్అండ్బీ అతిథిగృహంలో పదోన్నత నియామక పత్రాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 12: ప్రమోషన్ పొందిన ఎంపీడీవోలకు శుక్రవారం చిత్తూరులోని ఆర్అండ్బీ అతిథిగృహంలో పదోన్నత నియామక పత్రాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు. సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు కల్పించామని ఆయన చెప్పారు. పలువురికి డ్వామా కార్యాలయంలో డివిజనల్ డెవల్పమెంట్ అధికారులుగా పదోన్నతులు కల్పించినట్లు చెప్పారు. వీలైనంత మందికి ఒకేసారి పదోన్నతులు కల్పించేందుకు ప్రత్యేకంగా పోస్టులను గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉషశ్రీచరణ్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, పదోన్నతి పొందిన ఎంపీడీవోలు పాల్గొన్నారు.