బాధితులపైనే కేసుల బనాయింపు: బీద రవిచంద్ర

ABN , First Publish Date - 2022-06-24T20:59:24+05:30 IST

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీద రవిచంద్ర పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహిళా నేత, చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను

బాధితులపైనే కేసుల బనాయింపు: బీద రవిచంద్ర

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహిళా నేత, చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను ఆయన ఖండించారు. మహిళ అన్న కనికరం కూడా లేకుండా హేమలత పాదాలపై జీపుతో తొక్కించి గాయపర్చిందే కాకుండా.. తిరిగి వారిపైనే కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. తన అత్తా మామ హత్య కేసులో సాక్షులను వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, అండగా నిలవాల్సిన పోలీసులు వైసీపీ నేతల మెప్పు కోసం బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎత్తి చూపిన టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని.. అక్రమ కేసులు, సంఘ విద్రోహక కేసులు బనాయించి వేధిస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2022-06-24T20:59:24+05:30 IST