వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2021-12-03T05:40:12+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి
గోస్పాడు, డిసెంబరు 2: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఆడపడుచుల ఆత్మ గౌరవంలో భాగం గా గురువారం చింతకుంట్ల గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు విశ్వేశ్వరరెడ్డి, జయసింహారెడ్డి, భీమలింగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.