సమగ్ర సర్వేతో రైతుల భూములకు రక్షణ
ABN , First Publish Date - 2021-01-24T06:10:08+05:30 IST
రైతుల భూములు, గ్రామ కంఠాల పరిరక్షణ కోసమే సమగ్ర భూ సర్వేను ప్రభుత్వం చేపడుతున్నదని ఆర్డీవో సీతారామారావు చెప్పారు.
ఆర్డీవో సీతారామారావు
కొత్తూరు, జనవరి 23: రైతుల భూములు, గ్రామ కంఠాల పరిరక్షణ కోసమే సమగ్ర భూ సర్వేను ప్రభుత్వం చేపడుతున్నదని ఆర్డీవో సీతారామారావు చెప్పారు. సంపతిపురం పంచాయతీ టి.వెంకుపాలెం గ్రామంలో శనివారం డ్రోన్ కెమెరాలతో రీ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సర్వేతో రైతుల హక్కులను పరిరక్షించవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శ్రీనివాసరావు, ఎంపీడీవో పి.ఉమామహేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ సర్వేయర్ బాబూరావు, మండల సర్వేయర్లు లీల, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.