విశాఖలో మాజీ మంత్రి Avanti srinivasకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-07-04T17:21:43+05:30 IST
నగరంలోని పద్మనాభం మండలంలో అల్లూరి 125వ జయంతి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్కు నిరసన సెగ తగిలింది.
విశాఖపట్నం: నగరంలోని పద్మనాభం మండలంలో అల్లూరి (Alluri)125వ జయంతి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్(Avanti srinivas)కు నిరసన సెగ తగిలింది. పాండ్రంకి గ్రామంలో గోస్తని నదిపై బ్రిడ్జి నిర్మించాలంటూ మాజీ మంత్రిని పాండ్రంగి గ్రామస్తులతో పాటు జనసేన పార్టీ నియోజవర్గ ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ అడ్డుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని గ్రామస్తులు బైఠాయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అవంతి శ్రీనివాస్ను అక్కడి నుంచి సభాస్థలికి తీసుకువెళ్లారు.