25న వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
ABN , First Publish Date - 2020-09-23T11:19:38+05:30 IST
వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయా
బొబ్బిలి: వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని సీఐటీయూ నాయకుడు పొట్నూరు శంకరరావు పిలుపునిచ్చారు. ఇందుకు సం బంఽధించిన కరపత్రాలను మంగళవారం పంపిణీ చేశారు.
నవ్యా జూట్మిల్లు ముందు ఆయన మాట్లాడుతూ రూ.62 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్రం యోచిస్తోందన్నారు. ప్రజలంతా పెద్దఎత్తున తమ వ్యతిరేకతను తెలియజేయాలని కోరారు. ఆయన వెంట జూట్కార్మిక యూనియన్ అధ్యక్షుడు బీసీహెచ్ చిరంజీవులు, గణపతి, సత్యారావు ఉన్నారు.
బొబ్బిలి రూరల్: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, వ్యవసాయ బిల్లుకు నిరసనగా ఈ నెల 25న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి గోపాల్ కోరారు. సీహెచ్. బొడ్డవలస, వెంకటరాయుడుపేట, గోపాల రాయుడుపేటలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. వ్యవసాయ బిల్లు నిరసనలో అధిక సంఖ్యలో రైతులు, కార్మికులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.